సాయికుమార్ ను పరామర్శించిన రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొండాపూర్ డివిజన్ యువమోర్చ ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ పటేల్ ను బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పరామర్శించారు. గత కొద్దిరోజుల క్రితం కొండాపూర్ డివిజన్ కు చెందిన యువ మోర్చ ప్రధాన కార్యదర్శి సాయి‌కుమార్ రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడిన విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ తన నివాసానికి చేరుకుని సాయి కుమార్ ని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తనకు తన కుటుంబ‌ సభ్యులకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉంటామని భరోసా‌‌నిచ్చారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ యాదవ్, చంద్రశేఖర్ యాదవ్, కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, నరసయ్య, నవీన్, మల్లేష్, ఆదిత్య, మహేష్, అనిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

సాయికుమార్ ను పరామర్శిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here