బిజెపి రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ ను‌ కలిసిన రవికుమార్ యాదవ్, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ ను ఢిల్లీ లోని బిజెపి కేంద్ర ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాదర్ రెడ్డి మర్యాద పూర్వకంగా ‌కలిశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పై, గచ్చిబౌలి డివిజన్ లోనూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని తరుణ్ చుగ్ ను కోరినట్లు తెలిపారు. పార్టీ ప్రతిష్టతకు శాయశక్తులా‌ కృషి చేస్తున్నామని, క్యాడర్ లో పార్టీ పట్ల ఆత్మవిశ్వాసం పెంచి చాలా బలంగా మారుస్తున్నామని చెప్పామన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అధికార పార్టీకి ఏమాత్రం తీసిపోకుండా ముందుకు వెళ్తున్నామని, జాతీయ, రాష్ట్ర పెద్దల సహకారంతో మరింత ఉత్సాహంగా పని చేస్తామని తెలిపారు. అందుకు తరుణ్ చుగ్ వెన్ను తట్టి, ఎప్పుడూ మా ప్రోత్సాహాం ఉంటుందని, ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లాలని ప్రోత్సహించినట్లు చెప్పారు.

తరుణ్ చుగ్ ను మర్యాదపూర్వకంగా ‌కలిసిన రవికుమార్ యాదవ్, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here