నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ చేరికల వ్యవహారాల కమిటీ సభ్యులుగా నియమితులైన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని సోమవారం చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు రాకేష్ దూబే, డివిజన్ ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, జనరల్ సేకరటరీ లలిత రాణి రాజపుట్, మైనారిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సైఫుల్లా ఖాన్, గౌస్, మాజీ వార్డు మెంబర్ రమణ కుమారి, పోచయ్య, అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2022/07/IMG-20220718-WA0029.jpg)