- పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ దంపతులు
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ దంపతులు, చంద్రశేఖర్ దంపతుల ఆధ్వర్యంలో తమ నివాసంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను స్వామి వారికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, ఆయన సతీమణి శ్యామల దేవి కుటుంబ సభ్యులతో కలిసి అందజేశారు. అనంతరం కల్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ కుమారుడు పృథ్వి గాంధీ, కోడలు భార్గవి, సురేష్ బాబు, అరుణ కుమారి, కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, మంజల రఘునాథ్ రెడ్డి, భక్తులు, నాయకులు , కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందచేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శ్రీ సీతారాముల వారి కృపా కటాక్షాలతో ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామి వారి కృప ప్రజలందరిపై ఉంటుందని అన్నారు. పునర్వసు నక్షత్రం సందర్భంగా రాముల వారి కల్యాణం కనుల పండుగగా, అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.