శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో లింగంపల్లి డివిజన్ జనసేన వర్కింగ్ ప్రెసిడెంట్ దొంతోజు ఇందుమతి ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రామచంద్రపురం SI శశికాంత్ రెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు మార్కెట్ సభ్యులు , వీరమహిళలు, జనసేన పార్టీ నాయకులు, వివిధ డివిజన్ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు.
