హ‌ఫీజ్‌పేట్ రైల్వేట్రాక్‌పై విద్యుత్ స్తంభానికి ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

నమస్తే శేరిలింగంపల్లి: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి రైల్వై ట్రాక్ పైన విద్యుత్ స్థంభానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగద్గిరిగుట్ట శ్రీ రామ్ నగర్ కు చెందిన రేపనాల అంజనేయులు స్థానికంగా ఆటోడ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అతడికి ఐదుగురు సంతానం. ఆంజనేయులు తరచూ ఇంట్లో వారితో గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఇంట్లో వివాదం చోటు చేసుకోగా మనస్థాపానికి గురైన ఆంజనేయులు హఫీజ్ పేట్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ సమీపంలోని విద్యుత్ స్తంభానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఆంజనేయులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here