విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసిన రాగం దంపతులు

నమస్తే శేరిలింగంపల్లి: విఘ్నాలను తొలగించే ఏకదంత వినాయక స్వామికి ఆధ్యాత్మికతతో కుటుంబ సమేతంగా నల్లగండ్ల లక్ష్మివిహార్ లోని తన స్వగృహంలో శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిపూజలందుకునే విఘ్నేశ్వరుడిని ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా విశేష పూజలందుకునే ఏకదంత విఘ్నేశ్వరుడి పూజతో ప్రారంభిస్తారని తెలిపారు.
తదనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే గణపతి నవరాత్రులను మట్టి విగ్రహాల తోనే పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్ధించినట్లు చెప్పారు. యువనాయకులు రాగం అనిరుద్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here