శేరిలింగంపల్లి, జూన్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీగా నియమితులైన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ , గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి. జగదీశ్వర్ గౌడ్ ని మియాపూర్ వాసి రాచమళ్ల కృష్ణ గౌడ్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తాండ్ర రాంచందర్ గౌడ్, మానేపల్లి సాంబశివరావు, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.