రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి – చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందని, నిర్మాణం పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని జవహర్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రోడ్ల నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, గుత్తేదారులు రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. చందానగర్ డివిజన్ లోని ప్రతి కాలనిని ఆదర్శవంతగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ శివప్రసాద్, వర్క్ ఇన్ స్పెక్టర్ హరీష్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు నిర్మాణం పనులను పరిశీలిస్తున్న చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here