సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల వరం లాంటిదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన లక్ష ముప్పై ఆరు వేల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద ప్రజలు ధైర్యంతో వైద్య చికిత్స చేయించుకుంటున్నారని అన్నారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలనందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటుందన్నారు. అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఆర్థికంగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు నాయినేని చంద్రకాంత్, కోనేరు ప్రసాద్, సత్యనారాయణ, కాశీనాథ్ యాదవ్, చంద్రమోహన్ సాగర్, హరిబాబు,శ్రీనివాస్ చౌదరి, బృందారావు తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here