నిర్మాణ ప‌నుల్లో నాణ్య‌త ప్ర‌మాణాల‌ను పాటించాలి: ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ కమాన్ నుండి రూ. 1 కోటి అంచనా వ్యయంతో చేపట్టబోయే రోడ్డు డివైడర్ ఏర్పాటుకు GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేసేందుకు వీలుగా రోడ్డు మధ్యలో డివైడర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని , త్వరలోనే పనుల‌ను ప్రారంభించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డివైడర్ ను నిర్మించాలని, డివైడర్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC EE గోవర్ధన్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్, దేవినేని ప్రసాద్, రామచందర్, పురేందర్ రెడ్డి, ప్రసాద్, జలంధ‌ర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అధికారుల‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here