శేరిలింగంపల్లి, మార్చి 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని ఆదర్శనగర్ ప్లాట్ నెం. 53, స. నెం. 58/1 లో మిరియాల ప్రీతం అనే వ్యక్తి నిర్మించిన అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజావాణిలో జోనల్ కమీషనర్ కు జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేశారు. స్టెటస్కోలో నిర్మాణం చేస్తున్న సందర్భంలో కంటెంప్ట్ కూడా ఫైల్ చేసినా బిల్డర్ నిర్మాణం చేశాడని కసిరెడ్డి భాస్కరరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సెల్లార్, అనేక ఫ్లోర్లు నిర్మించడంతోపాటు 53 గజాలు అదనంగా కబ్జా చేశాడనే విషయం టౌన్ ప్లానింగ్ దర్యాప్తులో తేలిందని వెంటనే చర్యలు తీసుకోవాలని జనం కోసం డిమాండ్ చేస్తుందన్నారు. హోటల్ పేరు పెట్టి హోటల్ నడపడం లేదని, కోర్టు కేసు దృష్ట్యా అలా నడుపుతున్నట్టు ఫేక్ హోటల్ సృష్టించాడని ఫిర్యాదు చేశారు. వెంటనే ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేయాలని కోరారు.