ఆలయాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించండి – జడ్సీ శంకరయ్యకు గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని దేవాలయాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ శంకరయ్యకు వినతి పత్రం అందజేశారు. డివిజన్ పరిధిలోని అమ్మవారి దేవాలయాల వద్ద ఆషాడ మాసం బోనాలు నిర్వహించనున్న దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు‌ కలగకుండా చూడాలన్నారు. దేవాలయాల వద్ద భోనాలతో తమ మొక్కులు చెల్లించుకోనున్న నేపథ్యంలో అన్ని దేవాలయాల వద్ద గుంతలు పూడ్చివేసి, పారిశ్యుద్ద పనులు నిర్వహించాలని కోరారు. అలాగే భక్తులకు ఇబ్బందులు కలగకుండా లైటింగ్ ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి ఉన్నారు.

జోనల్ కమిషనర్ శంకరయ్యకు వినతి పత్రం‌ ఇస్తున్న గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here