శేరిలింగంపల్లి, మే 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మదీనాగూడలో ఉన్న శ్రీశ్రీ పోచమ్మ ఆలయంలో అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చిట్టబోయిన రమేష్ ముదిరాజ్, బిసి ఆర్గనైజేషన్ సెక్రటరీ హరికృష్ణ చారి, నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు.






