మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మియాపూర్ డివిజన్ కు తెరాస పార్టీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ నాయకుడు ఎండీ అన్వర్ షరీఫ్ శుక్రవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కోరారు. ఈ మేరకు అన్వర్ షరీఫ్ తన బయో డేటాను గాంధీకి అందజేశారు.

ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు మహేందర్ ముదిరాజ్, జహంగీర్, ఎండీ ఖాజా, ఎండీ రోషన్ అలీ, ప్రసాద్ ముదిరాజ్, హనుమంతు, గురువయ్య, ముజీబ్, రాజు, ఫెరోజ్, రహమత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.