చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): పేదలకు హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మెషిన్లను గాంధీ మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్ సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. సమాజం కోసం ఏదో చేయాలనే తపన కలిగి ఉండడం చాలా గొప్ప విషయమని అన్నారు.

ప్రతి ఒక్కరూ కొండా విజయ్ కుమార్ మాదిరిగా సమాజ సేవ చేసేందుకు ముందుకు రావాలని ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. కొండా విజయ్ కుమార్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన ఫౌండేషన్కు భవిష్యత్తులో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్, అన్వర్ షరీఫ్, మహేందర్ ముదిరాజ్, కాజా తదితరులు పాల్గొన్నారు.