శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ గౌలి దొడ్డిలో రాహుల్ చాతి ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి ఇన్చార్జి రవికుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు మెరుగైన వైద్యం చేయించుకోవాలంటే కార్పొరేట్ ఆసుపత్రులలో డబ్బులు వెచ్చించి వైద్యం చేయించుకునే స్థితిలో లేక చాలామంది పేదవారు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఇలాంటి హాస్పిటళ్లు ముందుకు వచ్చి ఉచిత టెస్టులు, ఉచితంగా మందులు పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యం అందిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా రాహుల్ ఆస్పత్రి యజమాన్యాన్ని అభినందించారు.
ఈ ఉచిత వైద్య క్యాంపులో బీపీ, షుగర్, లివర్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, కొలెస్ట్రాల్, ఐరన్ టెస్ట్ లాంటి ఉచితంగా టెస్టులు చేసి వాటికి అనుగుణంగా మందులు అందించారు. స్థానిక పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని రవికుమార్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పటల్ చైర్మన్ రాహుల్, ఆయన సతీమణి నీలిమ, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ రాజు, సీనియర్ నాయకులు సీతారామరాజు, కృష్ణరాజు , రమా, శోభ, వినయ్ ,శ్రీనివాస్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.