శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ PJR ఎనక్లేవ్ రోడ్డు లో ఉన్న శిరీష నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీ క్యాన్సర్ స్క్రినింగ్, ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ శిరీష నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రినింగ్ పరీక్ష, ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను నిర్వహించడం చాలా అభినదించదగ్గ విషయం అని, కాలనీ వాసులకు, చుట్టుపక్కల పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించడం చాలా శుభపరిణామం అని అన్నారు. క్యాన్సర్ మహమ్మారిని మొదటి దశలోనే గుర్తించి సరైన వైద్యం అందిస్తే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, ప్రసాద్, శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ కిరణ్ ,శిరీష, వైద్య సిబ్బంది, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.