పెహల్గామ్ ఉగ్ర‌దాడిని ఖండిస్తూ శాంతియుత ప్ర‌ద‌ర్శ‌న

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పెహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండిస్తున్నామ‌ని శేరిలింగంపల్లి మండల బీసీ అధ్యక్షుడు వల్లెపు మాధవరావు అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ శ్రీరామ్ నగర్ ఆంధ్ర బ్యాంకు నుంచి చిరాక్ స్కూల్ వరకు, చిరాక్ స్కూల్ నుండి శ్రీరామ్ న‌గర్ ఏ బ్లాక్ వరకు ఆయ‌న ఆధ్వ‌ర్యంలో శాంతియుత ప్రదర్శన చేప‌ట్టారు. ప్లకార్డులు ప్రదర్శస్తూ మృతుల ఆత్మశాంతి కోరుతూ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

ఈ సందర్బంగా మాధ‌వ‌రావు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడితో యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి లోనైందన్నారు. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపి ఉగ్రవాదాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపు నిచ్చారు. పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఇటువంటి దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగురు శ్రీనివాస యాదవ్, శ్రీరామ నగర్ కాలనీ ఏ బ్లాక్ ప్రెసిడెంట్ శివకుమార్, తిరుపతి యాదవ్, మల్లేష్ యాదవ్, మహమ్మద్, సందీప్, గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here