శేరిలింగంపల్లి, ఏప్రిల్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గేమ్ ఆన్ క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిధిగా పాల్గొని క్రికెట్ అకాడమీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయిబాబా క్రికెట్ ఆడారు. సాయిబాబా మాట్లాడుతూ క్రీడలను తల్లితండ్రులు బాల్యం నుండే పిల్లలను ప్రోత్సాహించాలని, పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి అవసరమైన శిక్షణ ఇవ్వడం ఎంతో అవసరం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మహమ్మద్ తౌఫిక్, అర్జున్, దారుగుపల్లి నరేష్, శ్యామ్లెట్, పాండు, సలావుద్దీన్, సంజీవ తదితరులు పాల్గొన్నారు.