శేరిలింగంపల్లి, ఏప్రిల్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో గత పది సంవత్సరాలలో వికసిత్ భారత్ దిశగా దేశ ప్రయాణం అమోఘమని శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్, ఆల్విన్ కాలనీ డివిజన్లలో స్థానికంగా ఉన్న ఆలయాల శుభ్రత, బస్తీ దవఖానాలలో ఉన్న సౌకర్యాలు, పాఠశాలలు, అంగన్వాడి సెంటర్లు , శ్మశానవాటికలను సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే బూత్ అధ్యక్షుల ఇంటివద్ద భారతీయ జనతా పార్టీ జెండాలను ఆవిష్కరించి స్థానిక దళిత నాయకుల ఇంట్లో భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో మూడోసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం దేశ రాజకీయాల్లో, అభివృద్ధిలో పరావర్తన కొత్త శకానికి నాంది పలికే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర పార్టీ సూచన మేరకు గావ్ చలో బస్తి చలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ కేంద్రం తీసుకున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు, వక్స్ బోర్డ్ సవరణ, జీరో టాక్స్ పరిమితిని 12 లక్షల వరకు పన్ను చెల్లింపు దారులకు ఉపశమనం కల్పించడం వంటి దేశ సామాజిక సమీకరణాలను ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గావ్ చలో- బస్తీ చలో కార్యక్రమ ఇన్చార్జులు మణిభూషణ్, శాంతిభూషణ్ ,నర్సింగ్ యాదవ్, నర్సింగ్ రావు, వెంకటస్వామి రెడ్డి, సీనియర్ నాయకులు రామరాజు, కేశవరావు, నరేందర్ రెడ్డి, నరసింహ చారి ,కుమార్ యాదవ్, కమలాకర్ రెడ్డి, రమేష్, రామ్ రెడ్డి ,ఆంజనేయులు యాదవ్ ,రాయల్, గోవింద్, రాజు ,సందీప్ గౌడ్, సురేష్ ,ఎస్ కే చాంద్, అనిత, స్రవంతి, జ్యోతి, కవిత పాల్గొన్నారు.