ప్రత్యేక రాష్ట్రంలో బోనాల ఉత్సవాలకు ప్రాధాన్యత – మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో బోనాల మహోత్సవాలకు ప్రాధాన్యత పెరిగి అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని గంగారాం గ్రామంలో కంది జ్ఞానేశ్వర్, లింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ యూత్ అసోసియేషన్, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల గ్రామంలో శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహార బండి ఊరేగింపు కార్యక్రమాల్లో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలన్నారు. కుటుంబ బాంధ్య‌వాల‌తో పెన‌వేసుకుపోయిన బంధం బోనం అని, స్త్రీ శ‌క్తికి ప్ర‌తిరూపం మన తెలంగాణ బోనం అన్నారు.

పలహార బండి‌ ఊరేగింపులో పాల్గొన్న మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ను సత్కరిస్తున్న కమిటీ నిర్వాహకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here