జ‌డ్‌సీ హేమంత్ బోర్ఖడేకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శుభాకాంక్ష‌లు

శేరిలింగంపల్లి, మే 31 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ గా నియమితులైన సందర్భంగా హేమంత్ బోర్ఖడేని శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ల‌తో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై జోనల్ కమిషనర్ తో చర్చించారు. పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని , అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని, పనులలో వేగం పెంచాలని, సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడాలని , అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. దీని పై జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే సానుకూలంగా స్పందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here