ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి PAC చైర్మన్ ఆరెక‌పూడి గాంధీ ధ‌న్య‌వాదాలు

శేరిలింగంపల్లి, మే 29 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): రూ.200కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో పేద, మద్య తరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేప‌ట్టిన‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గనికి అవకాశం లభించింద‌ని PAC చైర్మన్ ఆరెక‌పూడి గాంధీ తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి అడగగానే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు కోసం బడ్జెట్ కేటాయించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాన‌ని అన్నారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గానికి రూ. 200 కోట్ల నిధులతో ఆధునిక సదుపాయాలుతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింద‌న్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం విద్యారంగ అభివృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయి. పిల్లలు ఇక మెట్రో స్థాయి వసతులతో కూడిన పాఠశాలలో చదివే అవకాశాన్ని పొందనున్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి, ముఖ్యంగా మ‌న‌ నియోజకవర్గానికి రావడం గర్వంగా ఉంది. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరులో కీలకపాత్ర పోషించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తర‌పున, త‌న తర‌పున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన‌ని అన్నారు. ఈ పాఠశాల ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులు సైతం నాణ్యమైన విద్యను పొందుతారని, ఇది నియోజకవర్గ భవిష్యత్తు తరాల విద్యాభివృద్ధికి బలమైన పునాది కానుందని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here