శేరిలింగంపల్లి, మే 29 (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీని జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి డివిజన్ లోని వెజిటేబుల్ మార్కెట్ అభివృద్ధి, డివిజన్ లోని పలు అభివృద్ధి పనులను చేపట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అందుకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సానుకూలంగా స్పందిస్తూ అభివృద్ధి పనులకు శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్ పాల్గొన్నారు.