పీఏ నగర్ లో రవికుమార్ యాదవ్ బస్తీబాట

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పోగుల ఆగయ్య నగర్ లో నెలకొన్న సమస్యలపై బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ బస్తీబాట చేపట్టారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మాటలు తప్ప చేతల్లో ఆమడ దూరంలో ఉందని ఎద్దేవా చేశారు. స్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరై ఏళ్లు గడుస్తున్నా నేటికీ పనులు చేపట్టకపోవడం దారుణమన్నారు. చెత్త చెదారం చేరడంతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికార పార్టీ నాయకులు నాలాల పై ఇల్లు నిర్మించుకోవడం వలన వర్షపు నీరు, డ్రైనేజీ నీరు వెళ్లకపోవడంతో కాలనీ ముంపునకు గురవుతుందన్నారు. వెంటనే నాలాల విస్తరణ చేపట్టి , ప్రతి రోజు పారిశుద్ధ్యం పనులు చేపట్టాలన్నారు. ప్రజల అవసరాల దృష్ట్యా ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, వెంకటేష్, శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి, రామకృష్ణ, వినోద్ యాదవ్, గణేష్ ముదిరాజ్, బాబు, శ్రీను, రాము తదితరులు పాల్గొన్నారు.

పీఏ నగర్ లో బస్తీబాట చేపట్టిన బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here