ఆపరేషన్ సింధూర్ సంఘీభావ ర్యాలీ

శేరిలింగంపల్లి, మే 11 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): జమ్మూ కాశ్మీర్లో విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన యువతేజం మురళి నాయక్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మియాపూర్ డివిజన్ లో ఆపరేషన్ సింధూర్ ర్యాలీకి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్. సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ లో 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని ప్రశంసించారు. పాకిస్తాన్ మనదేశంలోని ఎయిర్ పోర్టులను టార్గెట్ చేసుకొని చేసిన దాడులను భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టిందని, ఆపరేషన్ సింధూర్‌కు సంఘీభావంగా మియాపూర్ బొల్లారం చౌరస్తా నుండి ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించామని తెలిపారు.

ఈ సందర్భంగా భారత ఆర్మీకి బలం చేకూర్చే విధంగా కులాలకు, మతాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకమై తమ మద్దతు తెలపాలని తెలిపారు. పోరాటంలో భారత ఆర్మీ గెలవాలని అన్ని డివిజన్ల‌లో పూజలు , అర్చనలు, ప్రార్థనలు చేసి భారత ఆర్మీకి ఆ భగవంతుని అండదండలు పుష్కలంగా ఉండే విధంగా మనమంతా మద్దతు ప్రకటించాలని తెలిపారు. అభిరామ్, ప్రభాకర్, లక్ష్మణ్, గణేష్ సురేష్, శ్రీనివాస్, రాము, విజయేందర్, భాష, నాగులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here