శేరిలింగంపల్లి, మే10 (నమస్తే శేరిలింగంపల్లి): డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు ఓ మహిళా డాక్టర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాయదుర్గంలోని ఒమెగా హాస్పిటల్ కు చెందిన సీఈవో చిగురుపాటి నమ్రత ముంబైకి చెందిన వంశ్ టక్కర్ అనే స్మగ్లర్ నుంచి కొకైన్ కొనుగోలు చేసింది. షేక్పేట్లోని అపర్ణ వన్ అపార్ట్మెంట్లో ఉన్న తన నివాసంలో వంశ్ టక్కర్కు చిగురుపాటి నమ్రత రూ.5 లక్షలు ఆన్లైన్ ద్వారా చెల్లించింది. 53 గ్రాముల కొకైన్ ఆర్డర్ ఇచ్చింది. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారంతో రాయదుర్గం పోలీసులు నమ్రత కొకైన్ తీసుకుంటుండగా దాడులు చేసి ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఆమెను రిమాండ్కు తరలించారు.