శేరిలింగంపల్లి, ఏప్రిల్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ లోని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ కార్యాలయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం శేరిలింగంపల్లి సర్కిల్, చందానగర్ సర్కిల్ పరిధిలోని పలు డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ GHMC ఇంజనీరింగ్ విభాగం, అన్ని విభాగాల అధికారులు కలిసి సమన్వయంతో పనిచేయాలని, ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా పనిచేయాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యల పై అధికారులు నిర్లిప్తతను వీడాలని, తమ దృష్టికి ప్రజల నుండి వచ్చిన ప్రజా సమస్యల పై స్పందించే అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
ప్రజావసరాల దృష్ట్యా కాలనీ లలో నెలకొన్న రోడ్ల సమస్యలను ప్రథమ ప్రాధాన్యత గా పరిగణనలోకి తీసుకుని త్వరిత గతిన పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని, పనులలో వేగం పెంచాలని అలసత్వం ప్రదర్శిచకూడదని, పెండింగ్ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అవసరం ఉన్న చోట కొత్త ప్రతిపాదనలు తీసుకోవాలని, వర్షాకాలం వచ్చే లోపు అన్ని పనులు పూర్తి చేసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ,అవసరమున్న చోట యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు SE శంకర్ నాయక్, EE GKD ప్రసాద్, EE ఇంద్ర బాయి, DE ఆనంద్ ,DE దుర్గ ప్రసాద్, DE విశాలాక్షి, AE ప్రశాంత్, AE ప్రతాప్, AE సంతోష్ ,AE సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.