స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఒక ఉదాహరణగా నిలవాలి: మొగలి సునీత రావు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రంగారెడ్డి జిల్లా షాబాద్ మండ‌లంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు పామేనా జ్యోతి గౌడ్ ఆధ్వ‌ర్యంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ నిర్వ‌హించారు. ఇందులో భాగంగా రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగలి సునీత రావు ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా నాయకులకు దిశా నిర్దేశం చేశారు. బూత్ స్థాయి, మండల స్థాయిలో కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు కష్టపడ్డ వారిని కాంగ్రెస్ గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటుందని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఒక ఉదాహరణగా నిలవాలని కోరారు. అనంతరం నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ , గ్యాస్ సిలిండర్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచినందుకు నిరసనగా జాతీయ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్క లాంభ అదేశాల మేరకు నిరసన కార్యక్రమం చేప‌ట్టారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ కాంగ్రెస్ నాయకురాళ్లు, జిల్లా నాయకురాళ్ళు, రంగారెడ్డి జిల్లాలో వివిధ నియోజకవర్గ అధ్యక్షురాళ్లు, బ్లాక్, మండల్, డివిజ‌న్ అధ్యక్షురాళ్లు, వివిధ మహిళ కమిటీ నాయకురాళ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మహిళ‌లు భారీ ఎత్తున పాల్గొన్నారు. నియోజకవర్గ అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్, బ్లాక్ అధ్యక్షరాళ్లు శ్రీదేవి, భాగ్యలక్ష్మి, మండల ప్రెసిడెంట్ సునీత రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్స్ రాజలక్ష్మి, శ్రీ జ్యోతి, విమల, షబానా, తన్వీర్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here