శేరిలింగంపల్లి, జూన్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చందానగర్ సర్కిల్ పరిధిలోని మాదాపూర్, మియాపూర్, హఫీజపేట్, చందానగర్ డివిజన్ల లో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వర్షాకాలం ను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, GHMC ఇంజనీరింగ్ విభాగం, అన్ని విభాగాల అధికారులు కలిసి సమన్వయంతో పనిచేయాలని, ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా పనిచేయాలని అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు EE ఇంద్రబాయి , DE శ్రీదేవి , DE దుర్గాప్రసాద్, AE ప్రశాంత్, AE ప్రతాప్, AE సంతోష్ రెడ్డి, AE సంతోష్ తదితరులు పాల్గొన్నారు.