అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో పనిచేయాలి: జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే

శేరిలింగంప‌ల్లి, మే 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జరిగిన కార్పొరేటర్ల సమీక్షా సమావేశంలో జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే, కార్పొరేటర్లు మంజుల రెడ్డి, వి సింధు ఆదర్శ రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, వి గంగాధర్ రెడ్డి, బి రాజ్ కుమార్, దేదీప్య, జగదీశ్వర్ గౌడ్, పుష్ప నగేష్ యాదవ్, అన్ని సర్కిళ్ల‌ ఉప కమిషనర్లు, సూపర్ టెండింగ్ ఇంజనీర్, గేమ్స్ ఇన్స్పెక్టర్ త‌దిత‌ర‌ అధికారులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే మాట్లాడుతూ అన్ని విభాగల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సమిష్టి కృషి తో శేరిలింగంపల్లి నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు.

పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇచారు, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని, నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని , పనులలో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, వర్షాకాలం లోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలని తెలియచేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు కు కృషి చేయాలని జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే తెలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here