జనప్రియ నగర్ 5th ఫేస్ కుటుంబాల‌కు న్యాయం చేస్తాం: PAC చైర్మన్ ఆరెక‌పూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, మే 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ 5th ఫేస్ లో 650 కుటుంబాలు నివ‌సిస్తున్నాయ‌ని, త‌మ‌ సెట్ బ్యాక్ ను ఆక్రమించి రోడ్డుగా చిత్రీకరించి త‌ప్పుడు పర్మిషన్ తీసుకున్న‌ వారి పై కఠిన చర్యలు తీసుకొని, త‌మ‌ సెట్ బ్యాక్ త‌మ‌కు ఇప్పించాలని PAC చైర్మన్ ఆరెక‌పూడి గాంధీని వివేకానంద నగర్ కాలనీలోని ఆయ‌న కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి జనప్రియ నగర్ కాల‌నీ 5th ఫేస్ వాసులు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ 5 th ఫేస్ లో 650 కుటుంబాలు నివ‌సిస్తున్నాయ‌ని, త‌మ సెట్ బ్యాక్ ను త‌ప్పుడు పర్మిషన్ తో కాజేయాల‌ని చూస్తున్నార‌ని అన్నారు. 25 సంవత్సరాలుగా హుడా అప్రూవర్ ప్లాన్ తో కూడిన త‌మ‌ సెట్ బ్యాక్ ను అపహరించే పనిలో కొంతమంది స్వార్థపరులు ఉన్నార‌ని, GHMC ని మోసం చేసి దొంగ‌ పత్రాలు సృష్టించి ఆ పత్రాలతో రోడ్డుగా చిత్రీకరించి అధికారులను కూడా తప్పుద్రోవ పట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, మోసం చేసిన మోసగాళ్ల బారి నుంచి కాపాడాలని కోరారు. 25 సంవత్సరాల త‌మ‌ డాక్యుమెంట్ ప్రకారం న్యాయం చేయాలని మరోసారి కోరారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ జనప్రియ నగర్ 5 th ఫేస్ కాలనీ వాసులుకు న్యాయం జరిగేలా చూస్తానని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు అని, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, కాలనీ వాసులు అధైర్య పడవద్దు అని , వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనప్రియ నగర్ 5th ఫేస్ కాలనీ వాసులు జాగృతి వేణుగోపాల్ రావు, శేఖర్ రెడ్డి, రవి కుమార్, రామ్ కిషన్ రావు, రామాంజనేయులు, చినబాబు, ప్రతాప్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here