శేరిలింగంపల్లి, మే 23 (నమస్తే శేరిలింగంపల్లి): క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందించడం కోసం ప్రభుత్వం వారికి పౌష్టికాహార కిట్ అందించడం జరుగుతుందని ఆసుపత్రి ఆర్. ఎం. ఓ. డాక్టర్ చంద్రకృష్ణ తెలిపారు. జిల్లా ఆసుపత్రి కొండాపూర్ లో క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ చంద్రకృష్ణ మాట్లాడుతూ క్షయ వ్యాధికి సంబంధించిన పరీక్షలు, మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి క్షయ వ్యాధిగ్రస్తునికి పోషణ బత్యం నిమిత్తం నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్ర కృష్ణ, సూపర్వైజర్ బీములు, స్టాటిస్టికల్ అసిస్టెంట్ సతీష్, హెల్త్ విజిటర్ సంతోష్ కుమార్ ,ల్యాబ్ టెక్నీషియన్ ప్రసన్నలత తదితరులు పాల్గొన్నారు.