విద్యార్థి దశ ఎంతో విలువైనది – మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: క్రమశిక్షణతో మంచిగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ అన్నారు. సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ బండ, శంశీగూడలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ బిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ మళ్లీ తిరిగి రానిదని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువుతో పాటు సమయం కూడా చాలా విలువైనదని, సమయం పోతే తిరిగిరాదని అందరూ బాగా చదువుకుని మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని సూచించారు.

శంశీగూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేసిన మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్

ఎల్లమ్మబండ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం లోకి నీరు వచ్చి పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని ఉపాధ్యాయులు తెలియజేయగా దానికి సానుకూలంగా స్పందించి సందయ్య మెమోరియల్ ట్రస్టు తరఫున చేయిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రావు, నర్సింగ్ యాదవ్, వెంకట స్వామి రెడ్డి, వేణు యాదవ్, రామ్ మోహన్, మహిళ నాయకులు పద్మ, సందీప్ గౌడ్, వినోద్ యాదవ్ ,విష్ణు, శేఖర్, రఘు, కృష్ణ, రామకృష్ణ , ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here