నాణ్యతా ప్రమాణాలు పాటించాలి – యూజీడీ పనులు పరిశీలించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచించారు.శేరిలింగంపల్లి డివిజన్ లోని నెహ్రూనగర్ లో భూగర్భ డ్రైనేజీ పైపులైన్ పెండింగ్ పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానికులు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలను పాటించి, పనులను త్వరితగతిన చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. డ్రైనేజీ లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో వెంటనే పారిశుద్ధ్య సిబ్బంది తో శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సోమదాస్, గోపినగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, నెహ్రూనగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్, రాంచందర్, శ్యామ్, ఈఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, కాలనీ వాసులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

నెహ్రూ నగర్ లో యూజీడీ పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here