గోవా కట్టెలపై జారి పడి మేస్త్రీ మృత్యువాత

నమస్తే శేరిలింగంపల్లి: నూతనంగా నిర్మిస్తున్న భవనం పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మేస్త్రీ మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ బికె ఎన్ క్లేవ్ కు చెందిన తూము బాల కొండయ్య (45) భవన నిర్మాణ మేస్త్రీగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మియాపూర్ లోని రెడ్డి కాలనీలో బసిరెడ్డి అనే వ్యక్తికి చెందిన నూతన భవన నిర్మాణంలో మేస్త్రీగా పనిచేస్తున్నాడు. భవన నిర్మాణం నాలుగో అంతస్తు వద్ద బాల‌కొండయ్య పనిచేస్తూ ప్రమాదవశాత్తు గోవా కట్టెలపై నుండి కాలుజారి కింద నేలపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.

గోవాపై నుంచి పడి మృత్యువాతకు గురైన మేస్త్రీ తూము బాలకొండయ్య
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here