ప్రభుత్వ విప్ గాంధీకి నవోదయ కాలనీ వాసుల కృతజ్ఞతలు

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నవోదయ కాలనీ అభివృద్ధికి శాయశక్తులా‌ కృషి చేస్తానని‌ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ‌తెలిపారు. నవోదయ కాలనీకి మంచి నీటి వసతి కల్పించిన సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ ఆధ్వర్యంలో కాలనీ వాసులు శనివారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కలిసి సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నవోదయ కాలనీలో ఎన్నో ఏళ్ల నుంచి నెలకొన్న మంచి నీటి సమస్య నేటి తో తీరిందన్నారు. కాలనీ లో దశల వారిగా అభివృద్ధి పనులు చేపట్టి కాలనీ ఒక ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ , నవోదయ కాలనీ వాసులు ముస్తక్, కిషన్ రావు, రాజు , మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ‌విప్ ఆరెకపూడి గాంధీ ని సన్మానించి‌న నవోదయకాలనీ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here