నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సోమేశ్వరస్వామి దేవాలయం చైర్మన్ చెన్నంరాజు ముదిరాజ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, నరేందర్ గౌడ్ లు స్థానిక మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ వేడుకలకు విశేష గుర్తింపు లభించిందని అన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. ఆకుల యాదగిరి, రాజు, కృష్ణా రెడ్డి, మీణమ్మ, రఫియా శ్యామల, తదితరులు పాల్గొన్నారు.
