స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని జ‌న‌ప్రియ న‌గ‌ర్ వాసుల విన‌తి

హ‌ఫీజ్‌పేట‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హ‌ఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై డివిజన్ తెరాస అధ్యక్షుడు గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ జనప్రియ నగర్ లో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని తెలిపారు. కాల‌నీలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకుడు ప్రవీణ్, స్థానికులు పాల్గొన్నారు.

ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీకి విన‌తిప‌త్రం అంద‌జేసిన జ‌న‌ప్రియ న‌గ‌ర్ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here