ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారిత‌నంగా ఉండాలి.. PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ సర్కిల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో డీసీ మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పలు కాలనీ వాసుల నుండి వచ్చిన వినతి పత్రాలను పరిగణన‌లోకి తీసుకొని అత్యవసర పనుల పై తక్షణమే స్పందించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ప్రతి ఫిర్యాదు పై స్పందించాలని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండలని , ప్రజల నుండి వచ్చే ప్రతి అర్జీ పరిష్కారానికి కృషి చేయాలని,ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో అధికారులు ఉండాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు EE KVS రాజు, DE శ్రీ దేవి, DE దుర్గాప్రసాద్, AE ప్రశాంత్, AE ప్రతాప్,AE ప్రశాంత్, AMOH రవి, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉషారాణి, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్ ,మాజీ కౌన్సిలర్ లక్ష్మీ నారాయణ గౌడ్, రఘునాథ్ రెడ్డి ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ,జనార్దన్ రెడ్డి,నాగరాజు, ఓ వెంకటేష్ అక్బర్ ఖాన్, పోషయ్య,భవాని, అనిల్, నరేందర్ బల్లా,యూసఫ్, రాజశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి త‌దితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here