ఈటల రాజేందర్ గెలుపు కోసం ముదిరాజ్ యువజన సమాఖ్య ఇంటింటా ప్రచారం

నమస్తే శేరిలింగంపల్లి: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ముదిరాజ్ ముద్దుబిడ్డ ఈటెల రాజేందర్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, ఆయన మంచితనం చూసి ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేసినట్లు యువరాజ్ పేర్కొన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా ఈటల రాజేందర్ కు ప్రజల నుండి మంచి ఆధరణ లభిస్తుందని తెలిపారు. ఈటల గెలుపు కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ముదిరాజ్ యువజన తరుపున కృతజ్ఞతలు తెలిపారు. హుజురాబాద్ ఉప పోరులో ఈటల రాజేందర్ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

హుజురాబాద్ లో ఈటల రాజేందర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న ముదిరాజ్ యువజన సమాఖ్య సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here