శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ,ప్రజాప్రతినిధులకు ,కార్పొరేటర్లకు, నాయకులకు ,కార్యకర్తలకు, ప్రతినిధులకు, పాత్రికేయులకు, అధికారులకు , కాలనీల వాసులకు, కాలనీ అసోసియేషన్ల సభ్యులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ 76 వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగం వల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు. దేశానికి స్వాతంత్రమెంత అవసరమో ప్రజలు స్వేచ్ఛగా బ్రతకడానికి రాజ్యాంగం ఒక వరం లాంటిదని అన్నారు. సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించి నేటికీ సరిగ్గా 75 ఏళ్ళుపూర్తి చేసుకొని76 వ వసంతం లోకి అడుగు పెడుతున్నామని అన్నారు. శేరిలింగంపల్లి నియోజక వర్గ ప్రజలకు 76 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు.
