వేమన రెడ్డి కాలనీలో‌ సీసీ రోడ్డు పనుల‌ను పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోకజకర్గాన్ని అందరి సహకారంతో అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ వేమన రెడ్డి కాలనీలో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందానగర్ డివిజన్ లో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతుల‌ కల్పనకు శాయశక్తులా‌ కృషి చేస్తామని అన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే గాంధీ సూచించారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు అక్బర్ ఖాన్, నరేందర్ బల్లా, వేమన రెడ్డి కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ వేమన రెడ్డి కాలనీలో సీసీ రోడ్డు పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here