తెలంగాణ సిద్దాంతకర్త జయశంకర్ సార్ కు ఘన నివాళి – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు, జీవితాంతం తెలంగాణ కోసం పరితపించిన మహోన్నతుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ 88 వ జయంతి సందర్భంగా వివేకానంద నగర్ డివిజన్ వివేకానంద నగర్ కాలనీ లోని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసంలో జయశంకర్ సార్ జయంతి వేడుకలు‌ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జీవితాంతం తెలంగాణ కోసం పరితపించిన మహానుభావుడు అని, ఆయన చూపిన బాటలో ప్రయాణిస్తూ ఆశయాలను కొనసాగిద్దామని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణకు ఒక దీక్సూచి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, నాయకులు కాశీనాథ్ యాదవ్, మోజేష్, రాము, యూసఫ్, శ్రావణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here