మియాపూర్ డివిజన్ లో ఘనంగా‌ శ్రీరామనవమి ఉత్సవాలు – ఉత్సవాల్లో ‌పాల్గొన్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్, మియాపూర్ విలేజ్, ప్రగతి ఎన్ క్లేవ్, ఆర్ డీ బీ కోకనట్ అపార్ట్మెంట్స్ తదితర‌ కాలనీల్లో శ్రీరామనవమిని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ స్థానిక‌ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ‌తో కలిసి పాల్గొన్నారు. సీతారామచంద్ర స్వాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ గాంధీ మాట్లాడుతూ శ్రీరాముని పాలనలో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించారని, ధర్మాన్ని ఆయుధంగా చేసుకుని శ్రీరాముడు అందరికి ఆదర్శంగా నిలిచాడన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామచందర్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు మోహన్ ముదిరాజ్, మహేందర్ ముదిరాజ్, దాసరి గోపి, ప్రవీణ్, రాం ప్రభు, చక్రవర్తి, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here