డొయెన్స్ కాలనీలో కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన ప్రభుత్వ విప్‌ గాంధీ, కార్పొరేటర్లు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని డోయన్స్ కాలనీ లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రభుత్వ విప్,‌ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డోయన్స్ కాలనీలో కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించుకోవడం సంతోషకరమని, కమ్యూనిటీ హాల్ నిర్మాణం వల్ల కాలనీలో సమావేశాలు, చిన్న చిన్న ఫంక్షన్లను చేసుకోవచ్చన్నారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పారు. అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు, విద్యుత్ దీపాలు తదితర మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు చింతకింది రవీందర్, రమేష్, వేణుగోపాల్ రెడ్డి, నట్ రాజు,‌‌ రమణ, గోపాల్, డోయన్స్ కాలనీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

డొయెన్స్ కాలనీలో కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here