పోరాట స్ఫూర్తిని నింపిన మహోన్నతుడు అల్లూరి సీతారామరాజు – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: భారతదేశాన్ని బ్రిటీష్ పాలకుల చెర నుంచి విముక్తి కల్పించేందుకు అందరిలో చైతన్య స్ఫూర్తిని నింపి ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన మన్యం దొర మన అల్లూరి సీతారామారాజు ను దేశ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. అల్లూరి సీతారామరాజు 124వ జయంతిని పురస్కరించుకొని మియాపూర్ డివిజన్ పరిధి జేపీ నగర్ లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తిగా ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర పోరాటంలో ఒక ప్రత్యేక అధ్యాయం అని, సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి ఆ పోరాటంలోనే ప్రాణాలర్పించిన మన్యం విప్లవ వీరుడని అన్నారు. మన్యం ప్రజలలో విప్ల బీజాలు నాటి ప్రజలను  చైతన్య పరిచి స్వతంత్ర పోరాటంలో పాల్గొనేలా చేసిన మహోన్నతుడని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, చంద్రశేఖర్, రోజా, కృష్ణం రాజు, పవన్ రాజు, హరికృష్ణ, సుధాకర్ రెడ్డి, దుర్గ రాజు, సీతారామరాజు, శివరామరాజు, పుల్లం రాజు, రమాదేవి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

మియాపూర్ డివిజన్ జేపీ నగర్ లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తదితరులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here