శేరిలింగంపల్లి, జూన్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో సరైన నీటి పారుదల నెట్వర్క్, క్లియర్ వాటర్ లాగింగ్ పాయింట్ల కోసం మెరుగైన సమన్వయాన్ని నిర్ధారించడానికి గాను GHMC శేరిలింగంపల్లి జోన్ డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది, HYDRAA సిబ్బందితో కలిసి జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలను చేపట్టాలన్నారు.