కాలనీలోని సమస్యలను పరిష్కరించాలి – ప్రభుత్వ విప్ గాంధీకి మాతృశ్రీ నగర్ కాలనీ వాసుల వినతి

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి పనులు చేపట్టాలని కాలనీ వాసులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని కోరారు. మాతృశ్రీ నగర్ లో చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులను,ఆయా సమస్యలతో‌ కూడిన వినతి పత్రాన్ని శనివారం కాలనీ వాసులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కి అందజేశారు. కాలనీలో సీసీ రోడ్ల ఏర్పాటు చేసి దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో అనిల్ కావూరి, నాగరాజు, వాసు, చందు,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ విప్ గాంధీకి వినతిపత్రం అందజేస్తున్న మాతృశ్రీ నగర్ కాలనీ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here